మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలో స్థానిక జాలర్లతో కలిసి చేపలు పట్టారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. జ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం చెరువుల పండుగను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చెరువుల పండుగ కార్యక్రమాల్లో పాల్గొంటూ…గంగమ్మ తల్లికి పూజలు చేస్తూ, బతుకమ్మలని చెరువుల్లో వదులుతూ, కట్టమైసమ్మల దగ్గర పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇక పెద్ద వంగర మండలం గంట్ల కుంట గ్రామ సమీపంలోకి రాగానే ఈ రోజు మృగశిర కావడంతో కుంట కట్ట చెరువు వద్ద చేపలు పడుతున్న జాలర్లు మంత్రి కంటపడ్డారు. వెంటనే తాను ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని ఆపి వారితో కలిసి చేపలు పట్టారు.
వలను ఓ వైపు తానుపడితే మరో వైపు జాలర్లు పట్టుకున్నారు. అంతా కలిసి వల విసిరి చేపలు పట్టారు. అందులో పడ్డ చిన్నచిన్న, కాస్త పెద్ద చేపల్ని చూసి వారిలాగే మురిసిపోయారు.
ప్రభుత్వం ఉచితంగా చేపలు వేసి, జాలర్లకు చేపలు పట్టుకునే అవకాశం కల్పిస్తూ ఆదాయ మార్గం చూపించిందని మంత్రి గుర్తుచేశారు.

గంట్లకుంట చెరువులో జాలర్లతో కలిసి చేపలు పట్టిన ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం చెరువుల పండుగను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చెరువుల పండుగ కార్యక్రమాల్లో పాల్గొంటూ…గంగమ్మ తల్లికి పూజలు చేస్తూ, బతుకమ్మలని చెరువుల్లో వదులుతూ, కట్టమైసమ్మల దగ్గర పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇక పెద్ద వంగర మండలం గంట్ల కుంట గ్రామ సమీపంలోకి రాగానే ఈ రోజు మృగశిర కావడంతో కుంట కట్ట చెరువు వద్ద చేపలు పడుతున్న జాలర్లు మంత్రి కంటపడ్డారు. వెంటనే తాను ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని ఆపి వారితో కలిసి చేపలు పట్టారు.
వలను ఓ వైపు తానుపడితే మరో వైపు జాలర్లు పట్టుకున్నారు. అంతా కలిసి వల విసిరి చేపలు పట్టారు. అందులో పడ్డ చిన్నచిన్న, కాస్త పెద్ద చేపల్ని చూసి వారిలాగే మురిసిపోయారు.
ప్రభుత్వం ఉచితంగా చేపలు వేసి, జాలర్లకు చేపలు పట్టుకునే అవకాశం కల్పిస్తూ ఆదాయ మార్గం చూపించిందని మంత్రి గుర్తుచేశారు.
Share: