
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని కావేరి నది దక్షిణ ఒడ్డున ఉన్న గ్రామం తిరుచెంతురై. హిందూ మెజారిటీ జనాభాగా ఉన్న ఈ గ్రామం పేరు సడన్ గా మీడియాలోకి వచ్చింది. కారణం?
ఈ గ్రామానికి సమీప గ్రామమైన ముల్లికరుపూర్ గ్రామానికి చెందిన రాజగోపాల్ అనే వ్యక్తి తనకున్న 1 ఎకరం 2 సెంట్ల భూమిని రాజరాజేశ్వరి అనే ఆమెకు విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి నప్పుడు, ఆ భూమి తనది కాదని, ఆ భూమిపై తనకు హక్కు లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.
దానిపై అతను రిజిష్టర్ ను సంప్రదించగా మీరు దస్తావేజు నమోదు చేయడానికి వచ్చిన ఆ భూమి వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంది. వక్ఫ్ బోర్డు ఆదేశాల ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ నమోదు చేయడం కుదరదు’’ అని రిజిస్ట్రార్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం “మీరు చెన్నైలోని వక్ఫ్ బోర్డ్ నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలి” అని ఆయన చెప్పారు.
1992లో కొనుగోలు చేసిన నా భూమిని నేను విక్రయించడానికి నేను వక్ఫ్ బోర్డు నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎందుకు పొందాలి?” అని రాజగోపాల్ ఆశ్చర్యంగా రిజిస్ట్రార్ ని అడిగాడు.
తమిళనాడు వక్ఫ్ బోర్డు నుంచి వచ్చిన 250 పేజీల లేఖను చూపుతూ, తిరుచెంతురై గ్రామంలో ఏదైనా భూమిని విక్రయించాలంటే చెన్నైలోని వక్ఫ్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని రిజిస్ట్రార్ తెలిపారు.
“గ్రామం మొత్తం తమదేనని వక్ఫ్ బోర్డు డీడీస్ డిపార్ట్మెంట్కు లేఖ మరియు డాక్యుమెంటేషన్ ద్వారా తెలియజేసింది. గ్రామంలో భూమికి సంబంధించిన దస్తావేజు నమోదు చేసుకునేందుకు వచ్చే వ్యక్తులు వక్ఫ్ బోర్డ్ నుండి నుంచి అభ్యంతరం లేదు అని ధ్రువీకరణ పత్రాన్ని పొందాలని కూడా పేర్కొనడం జరిగింది” అని రిజిస్ట్రార్ వివరించారు.
ఈ విషయాన్ని రాజగోపాల్ గ్రామస్తులకు చెప్పగా.. తమ భూమి తమది కాదని తెలిసిన గ్రామస్తులంతా షాక్కు గురయ్యారు. గ్రామస్థుల వద్ద నివాస మరియు వ్యవసాయ భూములకు అవసరమైన అన్ని భూ పత్రాలు ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు మొత్తం గ్రామంపై యాజమాన్యాన్ని ఎలా క్లెయిమ్ చేస్తుందని వారు ఆశ్చర్యపోయారు.
ఈ విషయాన్ని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
“గ్రామంలో మానెండియవల్లి సమేత చంద్రశేఖర స్వామి దేవాలయం ఉంది. అనేక పత్రాలు మరియు ఆధారాల ప్రకారం, ఈ ఆలయం 1,500 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయానికి తిరుచెంతురై గ్రామం మరియు చుట్టుపక్కల 369 ఎకరాల ఆస్తి ఉంది. ఈ ఆలయ ఆస్తి కూడా వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉందా? దీనికి ఆధారం ఏమిటి? రెవెన్యూ రికార్డులు ప్రకారం భూములు వ్యక్తులకు చెందినవి అయితే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా వక్ఫ్ బోర్డు ఆ ఆస్తులు తమవి అని ఎలా ప్రకటిస్తుంది? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
ఈ గ్రామం మొత్తాన్ని వక్ఫ్ తన ఆస్తిగా ఎలా ప్రకటిస్తుంది అని గ్రామస్తులు అడుగుతున్నారు
కానీ, 1995 వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ ఏ ఆస్తిని అయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించవచ్చు. అలా ప్రకటించిన విషయాన్ని ప్రజలకు వార్తా మధ్యమాల ద్వారా తెలపాలి అనే నిబంధన కూడా లేదు. అంతే కాదు అది వక్ఫ్
ఆస్తి కాదు ఆ ఆస్తి తమదే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ ఆస్తి యజమానిదే
ఈ మధ్య ఇటువంటి విషయం మీద సుప్రీంకోర్ట్ తీర్పు ఇస్తూ వాక్ఫ చట్టం 40 సెక్షన్ ప్రకారం సరి అయిన పరిశీలన, విచారణ లేకుండా, సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా వక్ఫ్ ఆస్తిని తనదిగా ప్రకటించ కూడదు అని చెప్పింది.
….చాడా శాస్త్రి….