నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ఇవాళ కూడా ప్రశ్నించింది. ఇవాళ కూడా రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ కార్యాలయానికి వచ్చారు. రాహుల్ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ కూడా ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. టెన్ జన్ పథ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇవాళ కూడా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేశారు. గోల్ మేథీ జంక్షన్, తుగ్లక్ రోడ్ జంక్షన్, క్లారిడ్జ్ జంక్షన్, క్యూ-పాయింట్ జంక్షన్, సున్హారీ మసీదు జంక్షన్, మౌలానా ఆజాద్ రోడ్ జంక్షన్, మాన్ సింగ్ రోడ్ జంక్షన్లలో ఉదయం 7 గంటల నుంచి 12 గంటల మధ్య ప్రయాణాలు నిలిపేశారు. .