తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ…సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల ఢిల్లీలో ధర్నాకు దిగారు. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అతిపెద్ద స్కాం అని ఆ విషయాన్ని దేశమంతటికీ తెలిపే ఉద్దేశంతోనే తాను ఢిల్లీ దాకా వచ్చానని ఆమె తెలిపారు.
అయితే తన అనుచరులు, కార్యకర్తలతో ఆమె జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ కు పాదయాత్రగా బయల్దేరిన షర్మిలను మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలించారు. పోలీసులు అడ్డుకుంటున్న సమయంలో షర్మిల,పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తం నెలకొంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి – సీబీఐ ఎంక్వైరీ వేయండి : ఢిల్లీలో షర్మిల ధర్నా- అరెస్ట్
అయితే తన అనుచరులు, కార్యకర్తలతో ఆమె జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ కు పాదయాత్రగా బయల్దేరిన షర్మిలను మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలించారు. పోలీసులు అడ్డుకుంటున్న సమయంలో షర్మిల,పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తం నెలకొంది.
Share: