
file photo
జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని సోపోరీ ప్రాంతంలోని బొమ్మై వద్ద కేంద్ర భద్రతా బలగాలకు, జైషే మహ్మద్ ఉగ్రవాదులకు మధ్య బుధవారం రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు, భద్రతా బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరిపారు. ఇద్దరు మరణించగా..ఓ పౌరుడికి గాయాలయ్యాయి.
హతమైన వారిని జైషేమహ్మద్ కు చెందిన మహమ్మద్ రఫీ , కైసర్ అష్రఫ్ గా గుర్తించారు.