జైషే మహ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులను బారాముల్లా ఎన్కౌంటర్లో మట్టుపెట్టారు. అయితే ఈ ఎన్కౌంటర్ లో జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన ముదాసిర్ అహ్మద్
వీరమరణం పొందాడు.
లోయ అంతటా భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన ‘నకాస్’ (చెక్పాయింట్లు)లో ఒకదాని దగ్గర ఈ ఎన్కౌంటర్ జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద ఉన్న చెక్ పాయింట్ వద్ద కాల్పులు జరిగాయి అని ఐజీ చెప్పారు.
గత మూడు, నాలుగు నెలలుగా గుల్మార్గ్లోని కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారని ఐజీపీ తెలిపారు. వారిని క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తున్నామనిఅన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు భద్రతా దళాలతో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 22 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు.
వందలాది మంది ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించిన కుమారుడిని చూసి గర్విస్తున్నానని తండ్రి అహ్మద్ షేక్ అన్నారు. మూడు రోజుల క్రితం తన కుమారుడితో చివరిసారి మాట్లాడినట్లు షేక్ తెలిపారు. వీళ్ళు నిజమైన భారతీయులు. అంతే కానీ వామపక్ష, ఉదార నేతలు నైతిక మద్దత్తు ఇచ్చే యాసిన్ మాలిక్ లు అజామ్ ఖాన్ లు కారు.
~ చాడా శాస్త్రి