ఢిల్లీలో కాలుష్య సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అత్యవసర చర్యలు చేపడుతోంది కేజ్రీవాల్ ప్రభుత్వం.
స్కూళ్లు మూసివేత, నిర్మాణ పనులపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలనుకుంటోంది. వాహన కాలుష్యాన్ని నివారించేందుకు చేపట్టిన ‘రెడ్ లైట్ ఆన్, గడాఫీ ఆఫ్’ ప్రచారం ఈనెల 18తో పూర్తి కానుందని అయితే పరిస్థితిలో పెద్దగా మార్పు లేనందున మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు చెప్పారు. సెకెండ్ ఫేజ్ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 3 వరకూ కొనసాగుతుందన్నారు.
అటు కాలుష్య సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇటీవల సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ”ప్రజలు ఎలా బతకాలి? రెండ్రోజుల లాక్డౌన్ అమలు చేసే ఆలోచన కానీ, ప్రత్నామ్నాయ ఆలోచనలు కానీ ఏమైనా చేస్తున్నారా?” అని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని నిలదీసింది. వ్యర్థ పదార్ధాలను తగులబెట్టే మిషన్లు రైతులకు ఎందుకు సమకూర్చకూడదని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ప్రశ్నించింది.