సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగి 11 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో గోదాంలో ఉన్న కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. 8 ఫైర్ ఇంజిన్లలు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశాయి. 11 మంది మృతదేహాల్నీ రెస్క్యూ టీం బయటకు తీశారు. పోలీసులు వాటిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బిహార్ కు చెందిన వలస కూలీలని తెలిసింది. మృతులను బిట్టు, సికిందర్, దినేష్, దామోదర్, చింటు, సికిందర్, రాజేష్, రాజు, దీపక్, సత్యేందర్, పంకజ్గా గుర్తించారు. గోదాం యజమాని సంపత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)