ఆంధ్రప్రదేశ్ లోనూ కరెంట్ చార్జీలు పెంచారు. 30 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.1.45 ఉంటే 1.9 పైసలు, 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.2.09 పైసలు ఉండే రూ.3 లు, 76-125 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.3.10 పైసలు ఉంటే రూ. 4.50 పైసలు, 126-225 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.4.45 పైసలు ఉంటే రూ.6 లకు పెరిగాయి.
226-400 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.7.50 పైసలు ఉంటే రూ.8.75 పైసలు, 400 యూనిట్లు దాటితే యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.9.20 పైసలు ఉంటే రూ.9.75 పైసలు పెంచినట్లు ఎపిఇఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి తెలిపారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలను పెంచామని… వినియోగదారులు సహకరించాలని కోరారు. ఛార్జీల పెంపుదల వల్ల ప్రభుత్వానికి 14 వందల కోట్లు ఆదాయం సమకూరనుంది.