దేశంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పశ్చిమబెంగాల్లోని 3, ఒడిషాలోని ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6న విడుదల కానుంది. సెప్టెంబర్ 30న ఎన్నిక, అక్టోబర్ 3న కౌంటింగ్ ఉంటాయి. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 13 చివరిరోజు. పశ్చిమబెంగాల్లోని భవానీపూర్, శంషేర్గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలకు, ఒడిశాలోని పిప్లి నియోజకవర్గానికి సెప్టెంబర్ 30న ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి, తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉండగా..కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.