రెండు తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది.స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8, అలాగే తెలంగాణలో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23 గడువు. మార్చి 13న పోలింగ్ , మార్చి 16న కౌంటింగ్. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఇక షెడ్యూల్ సైతం విడుదల కావడంతో ప్రచారవేగం పెంచనున్నారు.