ఎన్నికల ప్రచారం.. తేయాకు తోటలో కూలీలతో ప్రియాంకా వాద్రా..!!
https://twitter.com/ANI/status/1366626534874734592
అయిదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా విభిన్నశైలిలో ప్రచారం చేపడుతున్నారు. ఓటర్లను ఆకర్షించేవిధంగా ప్రచారం చేపడుతున్నారు. తాజాగా అసోంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా వాద్రా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నాడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుచోట్ల ఓటర్లతో కలిసి డ్యాన్సులు కూడా చేశారు. మంగళవారం నాడు కూడా ప్రచారంలో భాగంగా తేయాకు తోటల్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ కూలీలతో కలిసి ఆమె తేయాకును సేకరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.