శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే కొత్త బృందాన్ని ఏర్పాటు చేసి దానికి ‘శివసేన బాలాసాహెబ్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ తెలియజేశారు. రెబల్ ఎమ్మెల్యేలు ఇంకా గువహతిలోని హోటల్ రాడిసన్ బ్లూలో బస చేస్తున్నారు.
“మేము ఇప్పటికీ శివసేనలోనే ఉన్నాం. మేం శివసేన బాలాసాహెబ్ పేరుతో మా స్వంత ప్రత్యేక బృందాన్ని కలిగి ఉంటాము. పార్టీకి ఉన్నట్లే మాకు ఒక నాయకుడు, విప్, కార్యాలయం సహా అన్నీ ఉంటాయి. పార్టీ వ్యవస్థాపకుడి ఆలోచనలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందున మేం దానిని శివసేన బాలాసాహెబ్ అని పిలుస్తున్నాం” అని దీపక్ కేసర్కర్ అన్నారు.
https://twitter.com/ANI/status/1540605303666135040?s=20&t=jgZU2yoBPoLOc4wynhsJrw
నిబంధనల ప్రకారం ఒక పార్టీలోని మొత్తం ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల మంది గ్రూపుగా ఏర్పడితే, ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాన్ని కోల్పోరు, వారు పార్టీగా గుర్తించబడతారు. మేం ఆ విషయాన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఉద్ధవ్ ఠాక్రేకు విషయాలను వివరించడానికి మేం చాలా ప్రయత్నించాం, కానీ ఆయన ఎందుకు పెండింగ్లో ఉంచాలని అనుకున్నాడో మాకు తెలియదు. బీజేపీకి మద్దతివ్వడం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదా కొత్తగా ఎన్నికలకు వెళ్లడం వంటివి ఏక్నాథ్ షిండే ఆదేశాల మేరకు మాత్రమే తీసుకుంటామని దీపక్ కేసర్కర్ చెప్పారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేల కార్యాలయాలను ధ్వంసం చేసిన శివసేన గూండాలపై ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని దీపక్ కేసర్కర్ అన్నారు.
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈరోజు సమావేశం కానున్నారు, సమావేశం తర్వాత వారు తమ తదుపరి చర్యలను ప్రకటిస్తారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా ఉద్ధవ్ ఠాక్రేకి ఈరోజు లేఖ రాశారు, అకస్మాత్తుగా తొలగించిన తమ కుటుంబాల భద్రతను పునరుద్ధరించాలని కోరారు.