మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం 6 నెలల్లో కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. మంత్రి పదవుల పంపకం పూర్తయితే అసంతృప్తులు పెల్లుబుకుతాయని… దీంతో ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. అప్పుడిక శివసేన ఎమ్మెల్యేలంతా తిరిగి శివసేన గూటికి తిరిగివస్తారన్నారు. ఇవాళే ఏక్ నాథ్ సభలో బలనిరూపణ చేసుకున్నారు. 164 మంది ఎమ్మెల్యేలు షిండే వైపున్నారు.