కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఇప్పట్లో ఆగేలా లేవు. పార్టీలో గొడవలకు రాహుల్ గాంధీ కోరి మరీ నియమించుకున్న పీసీసీ చీఫ్ సిద్దూ కేంద్రం అవుతున్నారు. ఇవాళ కర్తార్ పూర్ ను సందర్శించిన బృందంలో సిద్దూ లేకపోవడాన్ని బట్టి అంతర్గత కుమ్ములాటలు ఏస్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. సీఎం చరణ్ జీత్ నేతృత్వంలో బృందం ఇవాళ కర్తార్ పూర్ వెళ్లింది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఆగిపోయిన ఈ యాత్రను, గురునానక్ పుట్టినరోజు, నవంబర్ 19న జరుపుకునే గురుపురబ్ తర్వాత పాకిస్తాన్లోని గురుద్వారాను సందర్శించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. చన్నీ నేతృత్వంలో ఆయన మంత్రివర్గంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా కర్తార్ పూర్ వెళ్లారు. చన్నీ ప్రతినిధి బృందం నుంచి సిద్ధూని తప్పించడంతో పంజాబ్ కాంగ్రెస్లో విభేదాలు, ముఖ్యంగా సిద్ధూ, చన్నీ మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
ప్రతినిధి బృందంలో సిద్ధూ ఉంటే ఇతర నాయకులందరి దృష్టీ ఆయనపై ఉంటుందని.. యాత్రలో సిద్దూనే కేంద్రం అవుతాడనే లేకుండా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2019 నవంబర్లో కారిడార్ను ప్రారంభించినప్పుడు ఆలయాన్ని సందర్శించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానం మేరకు సిద్దూ వెళ్లారు.