ఈటల అసైన్డ్ భూముల కబ్జా నిజమేనని తేలింది. భూ వివాదానికి సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించారు. దీంతో ….మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని ఆ భూములపై విచారణకోసం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సతీష్ ఆ గ్రామానికి చేరుకున్నారు. విచారణ సందర్భంగా గ్రామంలో ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. కలెక్టర్ హరీశ్ పర్యవేక్షణలో ఎంక్వైరీ సాగింది. అక్కడ అసైన్డ్ భూమి ఉన్న విషయం నిజమేనని అధికారులు నిర్థారించారు. బాధితులతోనూ మాట్లాడారు. అక్కడి భూముల్లో సర్వే సైతం నిర్వహించారుఅనంతరం పూర్తి వివరాలతో నివేదిక సైతం అందజేశారు.
అటు శామీర్పేటలోని మంత్రి ఈటల నివాసానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈటలను కావాలని టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు.