సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన అనంతరం నేషనల్ హెరాల్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. హెరాల్డ్ హౌస్ లోని 4వ అంతస్తులో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఇక్కడే నేషనల్ హెరాల్డ్ ప్రచురణ కార్యాలయం ఉంది. ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈడీ అధికారులు లోపలి ప్రవేశించారు.. ఇప్పటికీ కార్యాలయంలోనే ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని కాంగ్రెస్ యాజమాన్యంలోని నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక కార్యాలయంతో పాటు 12 ప్రదేశాలలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. కోల్కతాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా దర్యాప్తు సంస్థ దాడులు చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం.