ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఢిల్లీ సహా ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ 25 టీంలు హైదరాబాద్ లో తనిఖీలు చేపట్టారు. అభినవ్రెడ్డి, అభిషేక్, ప్రేమ్సాగర్రావు, అరుణ్ పిళ్ళై ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట, దోమలగూడ,ఇందిరాపార్క్ సమీపంలోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది.
అటు ఏపీలోని నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ దగ్గర మాగుంట కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. అన్ని ఫైళ్లను పరిశీలిస్తున్నారు.