నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీచేసింది. షబ్బీర్ అలీ, సుదర్శన్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, రేణుకాచౌదరి, గీతారెడ్డిసహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 10న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఈడీ తెలిపింది. అయితే తమకు ఇంకా నోటీసులు అందలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. తాను కూడా విరాళం ఇచ్చానని… ఇప్పటి వరకూ తనకు ఎలాంటి నోటీసులు రాలేదని అంజన్ కుమార్ యాదవ్,గీతా రెడ్డి అన్నారు. ఈ కేసు విషయమై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు.