డిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అసలైతే కవిత ఇవాళ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉండగా… ఆమె ఆరోగ్య కారణాలు చూపుతూ వెళ్లలేదు. ఈనేపథ్యంలోనే ఉదయం నుంచి డిల్లీలోని కేసీఆర్ నివాసంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారమే ఢిల్లీ చేరుకున్న ఆమె… ఉదయం 11 గంటలకు ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా..ఆమె న్యాయవాది సోమాభరత్ మాత్రమే వెళ్లారు. తన ఆరోగ్యం బాగాలేదని రాలేకపోతున్నానని కవిత ఈడీకి లేఖరాశారు. దాంతోపాటు సుప్రీంకోర్టులో తన పిటిషన్ పై విచారణ ఉన్నందున రాలేనని లాయర్ ద్వారా ఈడీకి లేఖ పంపారు. అయితే కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు రావల్సిందేనని ఈడీ తేల్చిచెప్పడంతో ఉత్కంఠ నెలకొంది. ఉదయం నుంచి కేసీఆర్ నివాసంలో న్యాయనిపుణులతోమంత్రులు కేటీఆర్, హరీష్ రావు పలువురు పార్టీ ముఖ్యులు చర్చించారు. అయితే ఆమె విజ్ఞప్తిపై కొన్ని గంటలకు స్పందించిన ఈడీ… ఈనెల 20 న విచారణకు రావల్సిందిగా ఆదేశించింది. కవితను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం నేపత్యంలో పెద్దసంఖ్యలో మంత్రులు, ఎంపీలు, మద్దతుదారులు మళ్లీ డిల్లీ బాట పట్టారు. అటు ఢిల్లీలో కేసీఆర్ నివాసం దగ్గర, హైదరాబాద్ లో కవిత నివాసం దగ్గర ఉదయం పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు గుమిగూడి కనపించారు. ఈడీనుంచి తాజా నోటీసులు రావడంతో ఎక్కడివాళ్లక్కడకు వెళ్లిపోయారు.
https://twitter.com/ANI/status/1636295208756191234?s=20