డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులపై రోహిత్ స్పందించారు. ఈడీనుంచి తాఖీదులు వచ్చింది నిజమేనన్న ఎమ్మెల్యే …. తన వ్యాపారాలు, కంపెనీలకు సంబంధించి వివరాలు అడిగారన్నారు. ఈనెల 19 విచారణకు హాజరవుతానన్నారు. అటు ముందునుంచీ డ్రగ్స్ కేసులో రకుల్ పేరు వినిపిస్తోంది. గతంలో ఈడీ ఆమెను ఆరుగంటలపాటు విచారించింది కూడా. ఇప్పుడు మరోసారి ఆమెకు నోటీసులు ఇచ్చారు.