ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను 215 కోట్ల దోపిడీ కేసులో నిందితురాలిగా పేర్కొంది. జాక్వెలిన్ పై ఈడీ ఈరోజు చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దోపిడీ సొమ్ముకు లబ్ధిదారునిగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుఖేష్ చంద్రశేఖర్ దోపిడీదారుడని ఆమెకు ముందే తెలుసని ఈడీ విశ్వసిస్తోంది. గతంలో సుకేష్ ఆమెకు 10 కోట్ల విలువైన బహుమతులు పంపినట్లు ఈడీ గుర్తించింది. 7 కోట్లకు పైగా విలువైన జాక్వెలిన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.