మైనింగ్ అక్రమాలకు సంబంధించి కరీంనగర్ జిల్లా ఈడీ, ఐటీ సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోంది. గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన కంపెనీల యజమానలు, వ్యక్తుల కార్యాలయాలు, ఇళ్లపై సోదాలు కొనసాగుతున్నాయి.
మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయంపైనా ఈడీ, ఐటీ దాడి చేసింది. సోదాలు నిర్వహించింది. గ్రానైట్ మైనింగ్ లో అక్రమాలు, మనీ లాండరింగ్ కు పాల్పడుతూ ఫెమా యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదుల నేపథ్యంలో గ్రానైట్ వ్యాపారులపై ఈ దాడులు చేపట్టారు. దాడుల సమయంలో మంత్రితో పాటు ఆయన కుటుంబసభ్యులెవ్వరూ ఇంట్లోలేరని తెలిసింది.
మంత్రి గంగులతో పాటు ఐదు గ్రానైట్ మైనింగ్ పరిశ్రమల కార్యాలయాల్లోనూ ఈడి, ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ పట్టణంలోని కామన్ చౌరస్తా, మంకమ్మతో పాటు వివిధ ప్రాంతాల్లో జాయింట్ ఆపరేషన్ చేస్తున్నది. కరీంనగర్ తో పాటు హైదరాబాదులోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రెండు మహానగరాల్లోనూ 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి ఈడీ, ఐటీ టీంలు.
కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలోని సీబీఐ కేసు నమోదు చేయగా.. సీబీఐతో పాటు ఈడీలో గ్రానైట్ అక్రమాలపై కేసు నమోదైంది. కామన్ ప్రాంతంలో అరవింగ్ గ్రానైట్ యజమాని అరవింద్ వ్యాసి ఇంట్లో ఈడీ సోదాలు జరుపుతోంది.