ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 36 చోట్ల ఈడీ సోదాలు చేసింది. ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్ లో దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రేం సాగర్, అభిషేక్, సృజన్ ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అయితే డిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో, డిల్లీ ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఇళ్లల్లో మాత్రం సోదాలు చేయడంలేదని ఈడీ అధికారులు తెలిపారు.
గతేడాది ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సిసోడియాసహా 15మంది వ్యక్తులు, పలు కంపెనీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది.