డిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు.కవిత విచారణ నేపథ్యంలో ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ఉదయమే పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు తుగ్లక్ రోడ్ లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఇంటినుంచి బయటకు వస్తూ పిడికిలి చూపిస్తూ ఏంకాదనే సంకేతాలు, భరోసా ఇస్తూ ఈడీ కార్యాలయానికెళ్లారు. కవిత భర్త అనిల్, ఆమె అడ్వొకేట్ మోసన్ రావు వెళ్లినా అధికారులు వాళ్లను అనుమతించలేదు. కవిత ఒక్కరే లోపలికి వెళ్లారు. ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
Delhi | BRS MLC K Kavitha arrives at the ED office in connection with the Delhi liquor policy case. pic.twitter.com/BQAwhl5zwv
— ANI (@ANI) March 11, 2023