క్యాసినో నిర్వాహకుడు చికోటీ ప్రవీణ్ ను కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. చికోటీతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలున్నాయన్నదానిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులైన మహేశ్, ధర్మేందర్ లనూ ఈడీ ప్రశ్నించింది. ప్రవీణ్తో కలిసి విదేశాలకు మహేష్, ధర్మేందర్ వెళ్లినట్లు చెబుతున్నారు. తలసాని శ్రీనివాస్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు చీకోటి ప్రవీణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారనే విషయాన్ని ఈడీ ఇదివరకే గుర్తించింది. మరోవైపు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలతో చీకోటి ప్రవీణ్ వాట్సాప్ చాటింగ్ నూ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ ఇచ్చిన వివరాల ఆధారంగా , అవసరమైతే ఆ ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈడీ విచారణలో పలు ఆసక్తిక అంశాలు గతంలో వెలుగులోకి వచ్చాయి. చీకోటి ప్రవీణ్ దావత్ చేస్తున్నాడంటే.. వీఐపీలు, పోలీస్ అధికారులు క్యూ కడతారన్న ప్రచారం ఉంది. పదేళ్ల క్రితమే శంషాబాద్ లోని ఓ మహల్లో దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి కుమార్తె పుట్టినరోజు వేడుక చేశాడు చికోటీ. జూన్ 12న చంపాపేటలోని సామ సరస్వతీ గార్డెన్స్లో తన జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నాడు.