రిపబ్లిక్ టీవీ, ఆర్నబ్ గోస్వామికి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. నకిలీ టీఆర్పీ కేసులో రిపబ్లిక్ మీడియా నెట్వర్క్, ఆర్నాబ్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఈడీ ముంబైలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కోర్టు న్యాయమూర్తి ఎంజి దేశ్పాండే చార్జిషీట్ను స్వీకరించారు. ఆరోపణలు వచ్చినట్టు .. రిపబ్లిక్ టీవీ, రిపబ్లిక్ భారత్ చూడటానికి ఎవరూ డబ్బుతీసుకోలేదని అందులో పేర్కొంది.
టిఆర్పి కేసు దర్యాప్తు సమయంలో ముంబై పోలీసులు, ముఖ్యంగా సచిన్ వాజ్ ఎలా లంచాలు స్వీకరించారో కూడా ఇడి ఛార్జ్ షీట్ లో వివరించింది. ఆసమయంలో సచిన్ వాజేకు 25 లక్షలు ఎలా చెందాయో కూడా వివరించింది.
రిపబ్లిక్ టీవీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, ఏయే ఛానెల్లు TRPలను తారుమారు చేశాయో కూడా చార్జ్ షీట్లో పేర్కొంది ఈడీ. దర్యాప్తులో భాగంగా… అవతకతవకలు జరిగాయంటున్న ప్యానెలల సోర్స్ డేటాను ఈడీ సేకరించింది. ముంబై పోలీసులు చెప్పిన ఆయా కుటుంబాలు బాక్స్ సినిమా, ఫక్త మరాఠీ, మహామూవీ, ఆజ్ తక్, ఇండియాటుడే, న్యూస్ నేషన్ వంటిచానళ్లూ చూస్తున్నట్టు తేలింది.
టీఆర్పీలో రిపబ్లిక్ టీవీ అవకతవకలకు పాల్పడిందని ముంబై పోలీసులు ప్రెస్మీట్ పెట్టి మరీ వివరించిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఈడీ…
నవంబర్ 2019 నుండి జూన్ 2020 మధ్య కాలంలో కుటుంబాల డేటా విశ్లేషించబడింది. BARC నుంచి సేకరించిన డేటా ఆధారంగా విశ్లేషించారు. ఈ విచారణలో రిపబ్లిక్ టీవీ, అర్నాబ్ గోస్వామికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈడీ తెలిపింది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… విచారణ సమయంలో, కొన్ని కుటుంబాలు RMS నుండి నగదు మొత్తాలను స్వీకరించడానికి బదులుగా న్యూస్ నేషన్,ఇండియా టుడే ఛానెల్లను చూస్తున్నారని సూచించే కొన్ని లీడ్లను ED చూసింది.దానిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని చార్జిషీట్లో పేర్కొంది.