మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ రాణాఆయూబ్ ను లండన్ వెళ్లకుండా అడ్డుకున్నారు. లండన్ వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆమెను… ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. తరువాత విమానం ఎక్కే ముందు నిలిపివేశారు ఈడీ అధికారులు. ఈడీ జారీ చేసిన లుక్-అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసి) ఆధారంగా ఆమెను నిలిపేసినట్టు అధికారులు తెలిపారు.
భారత ప్రజాస్వామ్యంపై కీలక ప్రసంగం చేయడానికి అంతర్జాతీయ జర్నలిజం ఫెస్టివల్కు వెళ్తున్నానని.. ఈ ఫెస్ట్ లో కీలకోపన్యాసం చేయడానికి నేను వెంటనే ఇటలీకి వెళ్లాల్సి ఉందని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఆ ఫెస్ట్ లో నా ప్రసంగం ఉండకుండదనీ, లండన్ ఫ్లైట్ ఎక్కబోతున్నప్పుడు ఇండియన్ ఇమ్మిగ్రేషన్ వద్ద తనను ఆపారంటూ ఆమె ట్వీట్ చేసింది.
వాషింగ్టన్కు చెందిన నాన్-ప్రాఫిట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిస్ట్స్, మహిళా జర్నలిస్టులపై ఆన్లైన్ దాడులపై చర్చ కోసం అయ్యూబ్ను యూకే ( లండన్) నుంచి ఆహ్వానించింది. ఇందులో అయ్యూబ్.. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ట్రోల్స్, ఆన్లైన్ వేధింపులు బెదిరింపులపై ప్రసంగించాల్సి ఉంది.
కాగా కరోనా కష్టకాలంలో విరాళాలు సేకరిస్తున్నప్పుడు విదేశీ నిధుల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు ఆమెను ఏప్రిల్ 1న విచారణకు పిలిచింది. రానా.. 2020- 2021 మధ్య కాలంలో కేట్తో అనే ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా రూ. 2.69 కోట్లకు పైగా విరాళాలు సేకరించినట్లు, విదేశీ నిధుల నిబంధనలను ఉల్లంఘించారని ఆర్థిక నేరాలను పరిశోధించే ఏజెన్సీ కనుగొంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)