మద్యం స్కాం కేసులో ఈడీ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ మూడో చార్జిషీట్ దాఖలైంది. మాగుంట రాఘవ, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషిలపై ఈ చార్జిషీట్ వేసింది. ఫిబ్రవరి 7న గౌతమ్ మల్హోత్రాను, 8న రాజేష్ జోషిని, 10న రాఘవను అరెస్ట్ చేసినట్లు చార్జిషీట్లో తెలిపింది. ఈ అనుబంధ చార్జిషీట్ పై ఈనెల 14న సీబీఐ కోర్ట్ విచారణ జరపనుంది.