
Election Commissioner Arun Goel
ఎన్నికల కమిషనర్ నియామకం ప్రక్రియను ఒక్కరోజులో పూర్తిచేయడంపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. ఈసీల నియామకంపై దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఈసీ అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను.. సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ సమర్పించారు. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసలైతే మే 15 నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. మే 15 నుంచి నవంబర్ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలంటూ.. అటార్నీ జనరల్ను ధర్మాసనం అడిగింది. సీఈసీగా నలుగురి పేర్లు సిఫార్సు చేస్తే.. అరుణ్ గోయల్ను మాత్రమే ఎలా నియమించారు? మిగతా వారిని ఏ ప్రాతిపదికన తిరస్కరించారు? జూనియర్ స్థాయి వ్యక్తిని సీఈసీగా ఎలా ఎంపిక చేశారుని కోర్టు ప్రశ్నించింది. అప్పటివరకు ఉన్న సీఈసీ పదవీవిరమణ వరకు కూడా ఆగకుండా ఆగమేఘాల మీద ఎలా ఎంపిక చేశారని..గోయల్ ఎంపికలో అంత ఉత్సాహం ఎందుకనీ నిలదీసింది.