ఉక్రెయిన్ యుద్ధం తెచ్చి పెట్టిన సమస్యలు ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఆహారపదార్ధాలు, ఇంధనం తదితరాల కొరత వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. 19 యూరోజోన్ దేశాల్లో 9.9 శాతం ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో వేతనాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అత్యధికులు సమ్మెబాట పట్టారు. ఆర్థిక సంక్షోభం దెబ్బకు బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. పదవి చేపట్టిన 45 రోజులకో ఆమె పదవిని వదులుకున్నారు. ఫ్రాన్స్ లో ఉద్యోగులు, రవాణా సంస్థ కార్మికులు, ప్రభుత్వాస్పత్రుల సిబ్బంది సహా చమురు కర్మాగారాల్లో పనిచేసే వాళ్లంతా సమ్మె బాట పట్టారు. ఇక జర్మనీలోనూ అదే పరిస్థితి. రొమేనియా, చెక్ రిపబ్లిక్ లో అయితే ప్రజలూ రోడ్డెక్కారు.