తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ లో ఫలితాలు విడుదల చేశారు. గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం, 30, 31 తేదీల్లో అగ్రి, మెడికల్ ఎంసెట్ పరీక్షలు జరిగాయి. ఈసెట్ లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో 80.41 శాతం, అగ్రికల్చర్ స్ట్రీమ్ లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు.