ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర మంత్రి, బీజేపీ చీఫ్ కూడా అయిన తెంజెన్ ఇమ్నా అలాంగ్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఓ దగ్గర భోజనం చేస్తున్న ఫొటోను ట్వీట్ చేస్తూ… ఎన్నికల పేరుతో అంతటా తిరుగుతూ పుష్టిగా భోజనం చేయడం బాగుందని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఓ నెటిజన్ మీరు కొలెస్టరాల్ ను ఏ మందులతో తగ్గించుకుంటారని అడ్డగ్గా ప్రజల ఆశీర్వాదాలతో అని తెంజెన్ బదులిచ్చారు.
అలాంగ్ కు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. తరచూ నవ్వించే సరదా పోస్టులు పెడుతుంటారు.బయట కూడా ఆయన అలాగే మన మాటలతో నవ్వులు పూయిస్తూ ఉంటారు.
https://twitter.com/AlongImna/status/1628682921262612481?s=20