ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దళితులను అవమానపరిచినట్టు ఫేక్ వార్తలు సృష్టించి ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ హుజురాబాద్ లోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన ఈటల జమున, మధుసూదన్ రెడ్డి, మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు సునీల్, OU JAC నేతలు నెహ్రూ నాయక్, సురేష్ యాదవ్.
ఈటల జమున రాజేందర్ :
దళితులంటే అపారమైన గౌరవం ఉంది. వారిని ప్రేమగా చూసే వాళ్ళం.
ఇవన్నీ కెసిఆర్ కుట్ర. తెరాస నాయకులు వారి బానిసలు ఇలాంటి ఫేక్ వార్తలు తయారు చేసి పెడుతున్నారు. వారిని వెంటనే గుర్తించి బయటకి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేస్తున్న.
దళిత బంధు హుజూరాబాద్ తో పాటు రాష్ట్ర మంతా ఇవ్వాలి.నమస్తే తెలంగాణ అబద్ధాలు రాస్తుంది. ఆ పత్రికను చదవ వద్దు అని పిలుపు ఇస్తున్నాం.
ప్రజల్లో కొట్లాడదాం కానీ ఇలాంటి పనులు చేయవద్దు.
దళితబంధు ఈటెల రాజేందర్ గారి రాజీనామా వల్లనే వచ్చింది. తెలంగాణలోనున్న ప్రతి దళిత
కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలి.
మధుసూదన్ రెడ్డి:
సోషల్ మీడియా లో నేను చేసినట్టు వచ్చిన ఛాటింగ్ చూసి నేనే ఆచ్చర్యపోయాను. ఇది పూర్తిగా కల్పితం. అవాస్తవం. ఒక పథకం ప్రకారం ఈటెల రాజేందర్ గారిని ఎదుర్కోలేక చేస్తున్న ప్రయత్నం. ఇలాంటి వార్తను తయారు చేసిన వారిని, స్ప్రెడ్ చేసిన వారిని గుర్తించి బయటపెట్టాలి. కటినంగా శిక్షించాలి అని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, 48 గంటల్లో తెల్చకపోతే కమిషనర్ ఆఫీస్ దగ్గరే నిరసన చేస్తాం.
సునీల్’ , మాదిగ హక్కుల దండోరా.
దళితులకు ఈటల రాజేందర్ ఒక పెద్దన్న. ఈటెల రాజేందర్ వల్లనే దళిత బంధు వచ్చింది. తప్పుడు వార్తలు సృష్టించి ఈటలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అంబేడ్కర్ మెడలో బీజేపీ కండువా వేసి ఏదో చేద్దామని చూస్తే అది పారలేదు. అందుకే ఈటెల గారు రాసినట్లు లేఖ సృష్టించారు. అది ఏం కాకపోయేసరికి ఈ రోజు దళితులను కించపరిచారు అని తయారు చేశారు. ఇవ్వన్నీ మా దళితులు నమ్మరు గాక నమ్మరు.
నెహ్రూ నాయక్:
కెసిఆర్ గారు ఈ పిచ్చి పనులు ఆపకపోతే మీ కుటుంబ సభ్యులు బయట తిరగలేరు.
సురేష్ యాదవ్:
ఈటెల రాజేందర్ గురించి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. అదే మీ గురించి ఉన్న వార్తలు బయటపెట్టిన కూడా మీ భార్యలు, తల్లులు మిమ్ముల్ని చెప్పులతో కొడతారు. ఇక నైనా ఆపండి. ప్రజాస్వామ్య బద్ధంగా కొట్లడండి.