వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం ఘాటుగా హెచ్చరించింది. పదే పదే తమపై ఆరోపణలు చేయడం తగదని చెప్పింది. ప్రతిసారి అధికార పార్టీకి కొమ్ముకాస్తోందంటూ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల సంఘం స్థాయిని దిగజార్చడం సరికాదని పేర్కొంది. ఇకపై పదేపదే ఈసీపై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది. కాగా, ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని టీఎంసీ అధికార ప్రతినిధులు కోల్కతాలో, ఢిల్లీలో రెండుసార్లు ఎన్నికల సంఘాన్ని కలిశారు. అయినప్పటికీ.. ఈసీ మరోసారి పార్టీలను కలవాలని అనడం ఈసీ ప్రతిష్టను దిగజార్చడమే అవుతుందని.. సీఈసీ కమిషనర్ సునీల్ అరోరా మమతా బెనర్జీ లేఖకు సమాధానమిచ్చారు. కాగా, ఇటీవల సీఎం మమతా బెనర్జీ ఈసీ అమిత్ షా ఆదేశాల ప్రకారం నడుస్తుందంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.