వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎలక్షన్ కమిషన్ మరో షాకిచ్చింది. బుధవారం నాడు ఇచ్చిన నోటీసు వివరణ ఇవ్వకముందే.. మరో నోటీసు కూడా జారీ చేసింది. ఇటీవల సీర్పీఎఫ్ జవాన్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపట్ల వివరణ ఇవ్వాలంటూ రెండో నోటీసు కూడా జారీచేసింది. ఏప్రిల్ 10వ తేదీ లోగా నోటీసులపై స్పందించి సరైన వివరణ ఇవ్వాలని పేర్కొంది. లేనిపక్షంలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.. పలుమార్లు ఈసీకి ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ స్పందించి నోటీసులు జారీచేసింది.
తొలుత ముస్లింలు అంతా టీఎంసీ పార్టీకే ఓటెయ్యాలని వ్యాఖ్యలు చేయగా.. రెండో సారి భద్రతా బలగాలను బీజేపీ సీఆర్పీఎఫ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. వారు మహిళలపై దాడులు జరుపుతున్నారని.. ఓటర్లపై కూడా దాడులు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. కాగా, మరో ఐదు విడతల పోలింగ్ మిగిలి ఉండగానే మమతా బెనర్జీకి ఈసీ నోటిసులు అందడం.. దానిపై వివరణ ఇచ్చేందుకు సమయం కూడా ఎక్కువగా లేకపోవడం టీఎంసీ శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మమతా బెనర్జీపై అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాకుండా నిషేధం విధించాలన్న డిమాండ్ వస్తుండం కూడా టీఎంసీని కలవరపెడుతోంది.
https://twitter.com/ANI/status/1380381010781609985