తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవలే డీఎంకే కీలక నేత ఇంట్లో వరుస దాడులు జరగగా.. పెద్ద ఎత్తున లిక్విడ్ క్యాష్ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. శుక్రవారం నాడు.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అల్లుడు సబరీశన్ నివాసంలో ఐటీశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నీలాంగరాయ్లోని ఆయన నివాసంతోపాటు మరో నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కోసమే కాకుండా.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున నిధులను తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో ఐటీశాఖ ఈ దాడులు చేస్తున్నట్లు సమాచారం.
https://twitter.com/ANI/status/1377841938167070721