ఎన్నికల వేళ.. క్రూడ్ బాంబుల కలకలం.
వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్రూడ్ బాంబులు కలకలం రేపుతున్నాయి. సౌత్ 24 పరగణ జిల్లాలోని భంగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున క్రూడ్ బాంబులు బయటపడ్డాయి. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే గత వారం రోజులుగా పలుచోట్ల క్రూడ్ బాంబుల దాడుల ఘటనలతో బెంగాల్ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. కషీపూర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మాల్దా జిల్లాలో కూడా క్రూడ్ బాంబులు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడ కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. గత వారం కూడా మాల్దాలో 18 క్రూడ్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే రాజకీయ నేతలు లక్ష్యంగా ఈ క్రూడ్ బాంబులతో దాడులు కొనసాగుతున్నాయి. బీజేపీ,సీపీఐ నేతలు లక్ష్యంగా క్రూడ్ బాంబులతో దాడులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ నేతలే ఆరోపిస్తున్నారు. టీఎంసీ పార్టీకి చెందిన గుండాలే క్రూడ్ బాంబులతో దాడులు చేస్తూ.. బీజేపీ నేతల్ని భయబ్రాంతులకు గురిచేస్తూ.. హత్యారాజకీయాలకు తెరలేపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఆదివారం నాడు.. బీజేపీకి చెందిన ఓ బూత్ స్థాయి అధ్యక్షుడిపై క్రూడ్ బాంబుతో దాడికి పాల్పడ్డారు.
West Bengal | Around 200 crude bombs were recovered from Bhangar area of South 24 Parganas district. Kashipur Police have started an investigation in this matter: Police
(Photo source – police) pic.twitter.com/DY8I0gi22o
— ANI (@ANI) March 9, 2021