ఎన్నికల వేళ.. సీఎం పినరయ్కు బిగ్ షాక్.. బాంబు పేల్చిన స్వస్ప సురేష్..!
కేరళలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఓ వైపు అధికార పార్టీ సీపీఎం మరోసారి పగ్గాలు చేపట్టాలని చూస్తుంటే.. మరోవైపు కమల దళం ఎలాగైనా పినరయ్ను గద్దె దింపి.. రాష్ట్రంలో కమలం జెండాను ఎగరేయాలని తహతహలాడుతుంది. ఈ క్రమంలోనే బీజేపీకి అదృష్టం తన్నుకొస్తుందనే చెప్పుకోవాలి. అధికార పార్టీ సీపీఎంకు వరుస షాక్లు తగులుతున్నాయి. మొన్ననే సీఎం అల్లుడు జైలు పాలైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో కీలక నేత కూడా జైలుపాలయ్యాడు. మరోవైపు పార్టీల కీలక నేతలు కూడా సీపీఎంకు గుడ్బై చెప్పి.. కమలం గూటికి చేరుతున్నారు. దీంతో సీపీఎం పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తాజాగా సీఎం పినరయ్ విజయన్కు మరో భారీ షాక్ తగిలింది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్కామ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదే కేసు ఇప్పుడు పినరయ్ విజయన్ మెడకు చుట్టుకుంది. 30 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో సీఎంకు కూడా లింకులు ఉన్నాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని గోల్డ్ స్కామ్ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ కూడా తన దర్యాప్తులో వెల్లడించారు. ఈ గోల్డ్ స్మగ్లింగ్లో సీఎం పినరయ్ విజయన్ పాత్ర కూడా ఉందని కస్టమ్స్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సీఎం పినరయ్తో పాటుగా.. స్పీకర్, మరో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నట్లు స్వప్నా సురేశ్ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టుకు కూడా తెలిపారు. సీఎం విజయన్ అరబ్బీ భాషలో మాట్లాడలేరని.. కాబట్టి కాన్సులేట్ జనరల్కు, సీఎం విజయన్కు మధ్య అనుసంధానకర్తగా స్వప్న సురేశ్ వ్యవహరించారని.. ఈ వ్యవహారంలో సీఎంతో సహా మంత్రులకు కోట్లాది రూపాయలు కమిషన్గా ముట్టిందని స్వప్న సురేశ్ దర్యాప్తు సందర్భంగా వెల్లడించారని కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.