హోలీ పండుగ వేళ.. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. జిల్లాలోని ఖురుకేడ తాలుకా కోబ్రామెండ అటవీ ప్రాంతంలో మావోల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో.. పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అయితే ఇదే సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు.. మావోయిస్టులపై ఎదురు కాల్పులకు దిగడంతో.. ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరు మావోయిస్టులు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ చేపడుతున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా, చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
Maharashtra: Five Naxals killed in an encounter with police in Khobramendha forest area of Kurkheda in Gadchiroli district, says Sandip Patil, DIG, Naxal Range
— ANI (@ANI) March 29, 2021