తాను స్వయంగా వేసిన మధుబని కళారూపాన్ని ప్రధానిమోదీకి అందజేసింది పద్మశ్రీ పురస్కారగ్రహీత దులారీదేవి. రాష్ట్రపతిభవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అనంతరం ఆమె ఈ చిత్రాన్ని మోదీకి అందచేశారు. బిహార్ కు చెందిన దులారీకి కళారంగం విభాగంనుంచి పద్మ అవార్డు ఇచ్చారు. ఆమె కళను అభినందించిన ప్రధాని తనకు మధుబని కళారూపాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.