విపరీతంగా మద్యం సేవించి… ఆ మత్తులో తనతోపాటు విమానంలో ఉన్న మహిళపై మూత్రవిసర్జన చేశాడో వ్యక్తి. న్యూయార్క్ నుంచి డిల్లీ వస్తున్న ఎయిరిండియా బిజినెస్ క్లాస్ లో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా బయటకువచ్చింది. సదరు మహిళ సిబ్బందికి ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోకపోవడంతో నేరుగా టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ కు బాధితురాలు లేఖరాసింది. ప్రయాణీకుల భద్రత విషయంలో ఇంత అజాగ్రత్త ఏంటని… ఫిర్యాదుచేసినా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని వాపోయింది ఆ లేఖలో మహిళ. ఈ ఘటన గతేడాది నవంబర్ 26న A-102 ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో జరిగింది.
భోజనంతరువాత అందరూ నిద్రపోతున్న సమయంలో లైట్లు ఆర్పారని..అదే సమయంలో ఆ వ్యక్తి తనపై మూత్రవిసర్జన చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. తన సీటు దగ్గరకి వచ్చి మరీ ఆ పని చేయడంతో తన వస్తువులు కూడా తడిచిపోయాయని లేఖలో పేర్కొంది. మద్యం సేవించిన అతన్ని నో ఫ్లై లిస్ట్ లో చేర్చాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
An inebriated male passenger urinated on a female co-passenger in Air India's business class on Nov 26, 2022
Air India has lodged a police complaint regarding the incident which took place on Nov 26 when the flight was on its way from JFK (US) to Delhi: Air India official to ANI pic.twitter.com/XE55X6ao0b
— ANI (@ANI) January 4, 2023