భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టైంది. దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఏకంగా 14 వందల కోట్ల విలువచేసే 7 వందల కిలోల నిషేధిత మెఫోడ్రొన్ ను యాంటీనార్కోటిక్ సెల్ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసొపారాలో ఉన్న ఒక ఔషధ తయారీ కంపెనీ యూనిట్లో సోదాలు చేస్తుండగా ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి.
తమకు అందిన సమాచారంతో ఏఎన్సీ అధికారులు కంపెనీ ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టారు.కంపెనీ యూనిట్లో దీనిని తయారు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. కాగా ఈ డ్రగ్స్ రాకెట్కు సంబంధించి ముంబైలో నలుగురు, నలసొపారాలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు వివరించారు.
మెఫెడ్రొన్ ప్రమాదకర మాదకద్రవ్యం. మియోవ్ మియెవ్ అని అంటారు దీన్ని. వ్యక్తుల మానసిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతుంది.