ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్లో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. లేహ్ ప్రాంతంలోని అతి చిన్న గ్రామాల్లో ఒకటైన ‘ఉమ్లా’కు జల్ జీవన్ మిషన్ ద్వారా నీరందుతోంది. ఆ గ్రామంలో 25ఇళ్లున్నాయి..
ఇప్పుడు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా పంపు ద్వారా రక్షిత మంచినీరు పొందుతున్నారు గ్రామస్థులు.
ఇంతకు ముందైతే శీతాకాలంలో పేరుకున్న మంచును పగులకొట్టి వాటి నుంచి వచ్చేనీటిని సేకరించి వాడుకోవడం తప్ప మరోమార్గం ఉండేది కాదు..మంచినీటి వసతి కల్పించిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు చెబుతున్నారు…