ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ఇండియన్ నావల్ షిప్(ఐఎన్ఎస్) నుంచి ప్రయోగించిన వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం)ను భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఇవాళ ప్రకటించింది.
VL-SRSAM విమాన పరీక్ష విజయవంతమైనందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ DRDO, భారత నౌకాదళాన్ని అభినందించారు.
“ఒడిశాలోని చాందీపూర్ తీరంలో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ విజయవంతమైన విమాన పరీక్షకు DRDOకు, ఇండియన్ నేవీకి అభినందనలు. ఈ విజయం వైమానిక ముప్పులకు వ్యతిరేకంగా భారత నౌకాదళ షిప్ ల రక్షణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది” అని సింగ్ ట్వీట్ చేశారు.
https://twitter.com/rajnathsingh/status/1540256546353192961?s=20&t=k_Jb5IDjkVl67z-lb3anbw