అభ్యాస్ హై స్పీడ్ ఏరియల్ టార్గెట్ను ఇవాళ డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. గ్రౌండ్ బేస్డ్ కంట్రోలర్ నుండి సబ్సోనిక్ వేగంతో ఎగిరిన అభ్యాస్ ముందుగా నిర్ణయించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పరీక్ష నిర్వహించిన సమయంలో సెన్సార్లు ఆ ఏరియల్ టార్గెట్కు చెందిన రేడార్, ఎలక్ట్రికల్ ఆప్టికల్ సిస్టమ్ను ట్రాక్ చేశాయి. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసర్చ్, డీఆర్డీవోలు సంయుక్తంగా అభ్యాస్ ఎయిర్క్రాఫ్ట్ను డెవలప్ చేశాయి.
#DRDOforIndia | Strengthening indigenous capabilities, #ABHYAS-HEAT has been successfully flight tested from ITR today. The test demonstrated the performance at low altitude including sustained level & high manoeuvrability. #AtmanirbharDefence@DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/y6a3SBMAk3
— DRDO (@DRDO_India) June 29, 2022
ఈ టార్గెట్ విమానం పని తీరును టెలిమెట్రీ, రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టం వంటి వివిధ సెన్సర్ల ద్వారా పర్యవేక్షించినట్లు దీన్ని రూపొందించిన డిఆర్డిఓ వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని డిఆర్డిఓకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో దీన్ని అభివృద్ధి చేశారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు డీఆర్డీఓ శాస్త్రజ్ఞులు, సాయుధ బలగాలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.