ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం త్రివిధ దళాలు ఆమెకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, స్పీకర్ ఓంబిర్లా, కేంద్రమంత్రులు, ఎంపీలు, గవర్నర్లు, సీఎంలు, త్రివిధ దళాల అధికారులు హాజరయ్యారు.