భారతదేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. వినయం.. ఆప్యాయత.. స్ఫూర్తిదాయకం.. భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గురించి ఆమెకు తెలిసిన వారు ఇలా వర్ణిస్తారు. ఒడిశాకు చెందిన 64 ఏళ్ల గిరిజన నాయకురాలు నిన్న భారతదేశ తొలి ఆదివాసీ అధ్యక్షురాలిగా ఎన్నికై, ప్రతిపక్షానికి చెందిన యశ్వంత్ సిన్హాను ఓడించి చరిత్ర సృష్టించింది.
ముర్ముకు 2,824 ఓట్లతో విజయం సాధించింది, వాటి విలువ 6,76,803. ప్రత్యర్థి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,877 ఓట్లు వాటి విలువ 3,80,177. జూలై 18న జరిగిన పోలింగ్లో మొత్తం 4,809 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అందులో 53 చెల్లని ఓట్లుగా రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ మోదీ వెల్లడించారు.
పీసీ మోదీ ఢిల్లీలోని రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకి ఆమె నివాసంలోసర్టిఫికేట్ అందజేశారు.
ద్రౌపది ముర్ము విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. 1.3 బిలియన్ల మంది భారతీయులు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటున్న సమయంలో.. తూర్పు భారతదేశంలోని మారుమూల ప్రాంతంలో జన్మించిన గిరిజన సమాజానికి చెందిన భారతదేశపు కుమార్తె మన రాష్ట్రపతిగా ఎన్నికైంది. ఈ విజయంపై ద్రౌపది ముర్ము గారికి నా అభినందనలు.
శ్రీమతి ద్రౌపది ముర్ము జీ జీవితం, ఆమె ప్రారంభ పోరాటాలు, గొప్ప సేవ, ఆదర్శప్రాయమైన విజయం ప్రతి భారతీయుడిని ప్రేరేపిస్తాయి.
ఆమె మన పౌరులకు, ముఖ్యంగా పేదలకు.. అట్టడుగున ఉన్నవారికి.. అణగారిన వారికి ఆశా కిరణంగా ఉద్భవించారు.
పార్టీలకు అతీతంగా ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆమె విజయం మన ప్రజాస్వామ్యానికి శుభసూచకం” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.