ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవికిసమర్థురాలన్నారు జేడీఎస్ చీఫ్ దేవెగౌడ. ముర్మును కేవలం గిరిజన అభ్యర్థిగా పేర్కొనడం తనకు ఇష్టం లేదని.. అయితే ఆమె రాష్ట్రపతి పదవికి “సమర్థురాలు” అని ఆన్నారు మాజీ ప్రధాని.
“బీజేపీ ఆమెను (ముర్ము) రాష్ట్రపతి అభ్యర్థిగా చేయడానికి గల కారణాలపై నేను విశ్లేషించలేను. అనేకమంది పేర్లు పరిశీలనకు వచ్చాయి . ప్రతిపక్ష పార్టీల మొదటి సమావేశానికి నేను శరద్ పవార్తో కలిసి హాజరయ్యాను. కానీ నా అభిప్రాయం ప్రకారం బీజేపీ అభ్యర్థి అందుకు అర్హురాలు ”అని అన్నారు గౌడ.
ఆమె జార్ఖండ్ గవర్నర్గా ఉంది, అక్కడ ఎవరూ ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడి దాఖలాలు లేవు. ఆమె మొదట నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో (ఒడిశాలో) మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్… నా అనుభవంలో ఆమె ఎక్కడా వివాదాస్పదం కాలేదు ” అని అన్నారు.
అయితే ఆయన…తన పార్టీ ముర్ముకు మద్దతిస్తుందా లేక సిన్హాకా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు.