
అంతర్జాతీయ చైనా అనుకూల మీడియాలో రామోజీ ఈనాడు భాగస్వామ్యం !?
తాజా ఉదాహరణలు: రెండు వార్తలకిచ్చిన ప్రాధాన్యంతో
నిరూపణ !
మే 8 న సైన్స్ మేగజైన్ లాన్సెట్ సంపాదకీయ వార్త ! ఇది రాసింది చైనా దేశస్థురాలు ! అది కేవలం ఆమె లేక ఆ పత్రిక అభిప్రాయం మాత్రమే !
దానికి ఆధారాలు బురఖా దత్ లాంటి యాంటీ మోదీ, ప్రో చైనా జర్నలిస్టు పంపిన…. విశాఖ LG పోలీమర్స్ గాస్ దుర్ఘటన బాధితుల ఫొటోలు !
ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ లాంటి సంస్థలు
” ఊహించి అల్లిన అంచనాలు “
ఈ కట్టుకథ….
మోదీజీకి వ్యతిరేకంగా ఉందంటూ… పూర్తి స్థాయి అనువాదంతో అదే
మే 8 న పెద్ద వ్యాసమే ప్రచురించిన డ్రామోజీ ……!
సీన్కట్చేస్తే……!
నిరుడు కరోనా విజృంభించిన వేళ….
దానిని అంచనా వేయడంలో విఫలమైందా, నిర్లక్ష్యం గా వ్యవహరించిందా అన్నది తేల్చడానికి ఒక స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని…
ప్రపంచ ఆరోగ్య సంస్థను…
సుమారు 183 దేశాల
ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ముక్తకంఠంతో డిమాండ్ చేయడంతోనూ,
అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్… ఏకంగా నిధులు ఆపేస్తానని హెచ్చరికలు జారీ చేయడంతో… ( తర్వాత ఆపేశారు కూడా )
గతిలేక….
‘ది ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ ( IPPPR ) పేరుతో
న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, లైబీరియా మాజీ అధ్యక్షుడు (2011 నోబెల్ బహుమతి గ్రహీత) ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ అధ్యక్షతన అంతర్జాతీయ నిపుణులతో కూడిన ఓ స్వతంత్ర బృందాన్ని
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు
డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ నియమించాల్సి వచ్చింది.
ఇతనా పదవిలోకి రావడానికి ప్రధానంగా మద్దతిచ్చింది చైనా !
నిన్న ఈ స్వతంత్ర బృందం తన నివేదికను సమర్పించింది !
WHO నిర్లక్ష్యాన్ని, వైఫల్యాన్నీ, దుర్మార్గాన్ని, లోపభూయిష్ట విధానాల్ని చీల్చి చెండాండిదీ నివేదిక !
ఫిబ్రవరి 2020 లో ఈ సంస్థ వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రపంచం బలైపోయిందని నిర్మొహమాటంగా తేల్చింది.
దాదాపు 33 లక్షల మంది చావుకి కారణమయ్యిందని చెప్పేసింది.
నివారించగలిగిన ఈ విపత్కర పరిస్థితి కి కారణాలు కేవలం ప్రపంచ ఆరోగ్య సంస్థ…
ఆ కీలక సమయంలో తీసుకున్న పేలవమైన నిర్ణయాల పరంపర, సమన్వయం లేని వ్యవస్థల వల్లే ప్రజల్ని రక్షించడంలో విఫలమయ్యామని,
దీంతో… సైన్స్ ను
తిరస్కరించే నాయకులు ఈ ఆరోగ్య వ్యవస్థ లపై నమ్మకం కోల్పోయారని,
ప్రస్తుతం పరస్పరం సహకరించు కోవడానికి సిద్ధంగా లేని పరిస్థితి ప్రపంచ దేశాలకు ఏర్పడిందని అందులో పేర్కొన్నారు.
దీనిని చక్కదిద్దాలంటే, తక్షణమే ధనిక దేశాలు పేద దేశాలకు వందకోట్ల వాక్సిన్లను అందచేయాలని, వ్యాక్సిన్ తయారీ సంస్థలకు నిధులు, సాంకేతికత బదలాయింపు వంటివి చేయడం ద్వారా తిరిగి పరస్పర విశ్వాసం, నమ్మకం కలిగించాలని కమిటీ సూచించింది.
భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి,
అంతర్జాతీయ అప్రమత్త వ్యవస్థ ను ఏర్పాటు చేయాలనీ సూచించింది.
మరి డ్రామోజీ దేశద్రోహమేంటి ?
కేవలం ఒక పత్రిక అభిప్రాయాన్నీ, అదీ
ఆగర్భ శతృవు, కరోనా సృష్టికర్త చైనా దేశస్థురాలు రాసిన దాన్ని, అంత పెద్ద వ్యాసంగా… మొదటి పేజీలో కూడా ప్రస్తావించిన డ్రామోజీ…!
మరి ఇంతటి ప్రామాణికమైన నివేదికకు ఎంత స్థలం కేటాయించాడో చూడండి !
లోపలి పేజీలో….
చాలా చాలా చిన్న వార్త !
అదీ… నిష్కర్షగా తప్పు పట్టిన నిజాలు రాయలేదు.
రెండు వార్తల్నీ ఇక్కడిస్తున్నాను.
పాప పరిహారం కోసం కాబోలు…
నెట్ ఎడిషన్ లో కొద్దిగా పెద్ద వార్తే ఇచ్చాడు !
అయినా… మోదీజీ వ్యతిరేక
వార్త కిచ్చినంత కాదు !
ఇదే లాన్సెట్ పత్రిక ఇదే కమిటీ నివేదిక పై పెద్ద వార్తే ఇచ్చింది.
మరి దీనికెందుకు ప్రాధాన్యతివ్వలేదంటే…
ఇది తన రాజకీయ స్వప్రయోజనాలకు ఇబ్బంది కలిగించేది కాబట్టి !
మరోసారి… చైనా అనుకూల, మోదీజీ వ్యతిరేక వైఖరిని నిర్లజ్జగా బయట పెట్టుకున్నాడు డ్రామోజీ !
అదే అతని దేశద్రోహం !
****************************
కొవిడ్-19: మేక్ ఇట్ ఇన్ ది లాస్ట్ పాండమిక్’ పేరుతో ‘ది ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ (ఐపీపీపీఆర్) నివేదిక పై ఈనాడు ఇంటర్నెట్ డెస్క్ వార్తను,
ప్రింట్ వార్తను, మోదీజీ పై లాన్సెట్ సంపాదకీయం పై ఈనాడు వార్తను ఇక్కడ ఇస్తున్నాను.
****************************
ఎమర్జెన్సీగా ప్రకటించడంలో
WHO దే ఆలస్యం!
ఈ విపత్తు నివారించ గలిగిందేనన్న అంతర్జాతీయ నిపుణుల బృందం
WHOలో సంస్కరణలు అవసరమని సూచన
యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటి వరకు 33 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది.
అయితే, ఈ విపత్తును ఎదుర్కొనే సమయంలో తీసుకున్న పేలవమైన నిర్ణయాల పరంపరే ప్రస్తుత సంక్షోభానికి కారణమని మహమ్మారి సంసిద్ధతపై ఏర్పడిన అంతర్జాతీయ నిపుణుల బృందం అభిప్రాయపడింది.
భవిష్యత్లో ఇలాంటి విపత్తులు నివారించడానికి ఓ ‘అంతర్జాతీయ అప్రమత్త వ్యవస్థ’ అవసరమని ‘కొవిడ్-19: మేక్ ఇట్ ఇన్ ది లాస్ట్ పాండమిక్’ పేరుతో రూపొందించిన నివేదిక సూచించింది.
మహమ్మారిని అత్యవసర స్థితిని ప్రకటించడంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆలస్యం చేసిందన్న నిపుణుల బృందం..
WHOలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది.
‘‘ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి నివారించగలిగిందే.
చైనాలోని వుహాన్లో 2019 డిసెంబర్లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారిపై అత్యవసరంగా స్పందించడంలో వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అత్యవసర పరిస్థితిని ప్రకటించడంలో డబ్ల్యూహెచ్ఓ ఆలస్యం చేసింది.
దీంతో అత్యంత విలువైన నెల (ఫిబ్రవరి 2020) కాలాన్ని ప్రపంచదేశాలు కోల్పోయాయి’’ అని
‘ది ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ (ఐపీపీపీఆర్) తన నివేదికలో పేర్కొంది.
వీటితో పాటు వివిధ దేశాల పేలవమైన వ్యూహాలు, సమన్వయం లేని వ్యవస్థలు కలిసి ఈ విపత్తు మానవ సంక్షోభంగా మారడానికి కారణమయ్యాయని విశ్లేషించింది.
నూతన వ్యవస్థ అవసరం..
ప్రజలను రక్షించుకోవడంలో వ్యవస్థలు విఫలమవడంతో పాటు సైన్స్ను తిరస్కరించే నాయకులు ఆరోగ్య వ్యవస్థలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని అని ఐపీపీపీఆర్ తన నివేదికలో పేర్కొంది.
తొలుత మహమ్మారి ముప్పును పట్టించుకోక పోవడంతో ఇప్పుడు పరస్పరం సహకరించు కోవడానికి సిద్ధంగా లేని పరిస్థితి ప్రపంచ దేశాలకు ఏర్పడిందని అభిప్రాయపడింది.
అయితే, ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడాలంటే మాత్రం ధనిక దేశాలు వంద కోట్ల వ్యాక్సిన్ డోసులను పేద దేశాలకు అందించాలని సూచించింది.
అంతేకాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే ఇలాంటి మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఓ నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ధనిక దేశాలకు పిలుపునిచ్చింది.
ఈ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా డబ్ల్యూహెచ్ఓ వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని సూచించింది.
ఇలాంటి విపత్కర సందర్భంలో డబ్ల్యూహెచ్ఓ నాయకత్వంతో పాటు సిబ్బంది చేస్తున్న కృషిని నిపుణుల బృందం ప్రశంసించింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 విలయం, భవిష్యత్లో ఏర్పడే మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్ధతపై ఓ నివేదికను రూపొందించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సభ్యదేశాలు నిర్ణయించాయి.
ఇందుకోసం న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, లైబీరియా మాజీ అధ్యక్షుడు (2011 నోబెల్ బహుమతి గ్రహీత) ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ అధ్యక్షతన అంతర్జాతీయ నిపుణులతో కూడిన ఓ స్వతంత్ర బృందం ఏర్పడింది. గతేడాది ఏర్పాటైన ఈ బృందం..
మహమ్మారిని ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన చర్యలు,
జీ7, జీ20 దేశాల మద్దతు, పేద దేశాలకు వ్యాక్సిన్ల సరఫరా, వ్యాక్సిన్ తయారీ సంస్థలకు నిధులు, సాంకేతికత బదలాయింపు వంటి సూచనలతో కూడిన తుది నివేదికను తాజాగా విడుదల చేసింది.